News January 28, 2025
గుండ్లకమ్మను నిర్వీర్యం చేశారు: గొట్టిపాటి

గడిచిన ఐదేళ్ల కాలంలో సాగునీటి వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్వీర్యం చేయడమే కాకుండా గేట్లు విరగొట్టి ఇసుక దోపిడీకి పాల్పడిన చరిత్ర జగన్ ప్రభుత్వానిదే అని ధ్వజమెత్తారు.
Similar News
News December 17, 2025
Way2News కథనానికి స్పందించిన సీతక్క

Way2News కథనానికి మంత్రి సీతక్క స్పందించారు. మంగపేట మండలం దోమడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఏటూరునాగారంలో ఈనెల 9న ప్రచారానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా మంగళవారం<<18583277>> ‘మంత్రి సీతక్క.. ఆదుకోవా’ <<>>అనే శీర్షిక Way2News ద్వారా ప్రచురించగా సీతక్క స్పందించారు. బాధితుడితో ఫోనులో మాట్లాడి చికిత్సకు తోడ్పడతానని హామీ ఇచ్చారు.
News December 17, 2025
CBFC ‘NO’.. IFFKలో రిలీజ్: CM విజయన్

సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వని సినిమాలను ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- కేరళ’ (DEC12-19)లో రిలీజ్ చేస్తామని CM పినరయి విజయన్ ప్రకటించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసే కేంద్ర నియంతృత్వ ప్రయత్నాలను కేరళ అంగీకరించదని Fbలో స్పష్టం చేశారు. అయితే CBFC నో చెప్పిన 19 మూవీల్లో 4 స్క్రీనింగ్కు I&B మినిస్ట్రీ అనుమతిచ్చింది. ప్రదర్శనకు 2 వారాల ముందు లిస్ట్ ఇవ్వనందుకే మిగతా వాటికి పర్మిషన్ లేదని పేర్కొంది.
News December 17, 2025
కడప: శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్ అందజేత

మహిళల వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన మన కడప జిల్లా మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత చెక్కును మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉండవల్లిలో బుధవారం ఆమె అందుకున్నారు. కడపలో ఇంటి స్థలం, గ్రేడ్ వన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఆమెకు ఇవ్వనున్న విషయం తెలిసిందే.


