News January 28, 2025
గుండ్లకమ్మను నిర్వీర్యం చేశారు: గొట్టిపాటి

గడిచిన ఐదేళ్ల కాలంలో సాగునీటి వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్వీర్యం చేయడమే కాకుండా గేట్లు విరగొట్టి ఇసుక దోపిడీకి పాల్పడిన చరిత్ర జగన్ ప్రభుత్వానిదే అని ధ్వజమెత్తారు.
Similar News
News December 11, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

సీఎం చంద్రబాబు రేపు కపులుప్పాడలో కాగ్నిజెంట్ సహా ఐటీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం భీమిలి–కపులుప్పాడ ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. రోడ్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనలో లోపాలేమీ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
News December 11, 2025
రూ.100కే T20 వరల్డ్ కప్ టికెట్స్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం 6.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ICC ప్రకటించింది. ఇండియాలో ఫేజ్ వన్ టికెట్స్ రేట్స్ రూ.100 నుంచి, శ్రీలంకలో రూ.295 నుంచి ప్రారంభంకానున్నాయి. FEB 7నుంచి MAR 8 వరకు టోర్నీ కొనసాగనుంది. టికెట్స్ బుక్ చేసుకునేందుకు <
News December 11, 2025
ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పార్లమెంట్లో ప్రస్తావించారు.


