News April 10, 2025

గుజరాత్‌లో స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్ విగ్రహాన్ని సంద‌ర్శించిన మంత్రులు

image

గుజరాత్‌లోని సత్పురా, వింధ్యాచల్ పర్వత శ్రేణుల్లోనూ నర్మదా నది తీరంలో.. కెవాడియా ప్రాంతంలోఉన్న స‌ర్దార్ వ‌ల్ల‌బాయ్ ప‌టేల్ ఐక్య‌తా విగ్ర‌హాన్ని, మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సంద‌ర్శించారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగంగా దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను సందర్శిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 17, 2025

HYD: రేపటి బంద్ శాంతియుతంగా జరగాలి: డీజీపీ

image

వివిధ పార్టీలు తలపెట్టిన రేపటి బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకుగానీ పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తమన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయి. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు.

News October 17, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన INC అభ్యర్థి నవీన్ యాదవ్
* గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.. 17 ప్యాకేజీల్లో 7,449km రోడ్లకు రూ.6,294 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
* మద్యం దుకాణాల టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. 2,620వైన్స్‌లకు 25వేల దరఖాస్తులు
* బీసీ రిజర్వేషన్ల అంశంలో BJPని కాంగ్రెస్ బద్నాం చేస్తోందన్న MP డీకే అరుణ

News October 17, 2025

SDPT: స్థానిక ఎన్నికలు ఆలస్యం.. ఆశావాహుల్లో నిరుత్సాహం

image

స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆశవాహుల్లో నిరుత్సాహం నిండింది. ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల పక్రియ ఆగిపోయింది. దీంతో దసరాకు ముందు జోష్‌లో ఉన్న ఆయా పార్టీల నాయకులు ప్రస్తుతం చల్లబడిపోయారు. పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళితే ఎలా అన్న డైలామాలో పడ్డారు. 2018లో 225 స్థానాలు బీసీలకు దక్కగా రిజర్వేషన్లతో 327 స్థానాలు దక్కాయి.