News April 5, 2024

గుడివాడలో నోటాను దాటని జాతీయ పార్టీలు

image

2019లో గుడివాడ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. నోటాకు 3,285 ఓట్లు(1.96%) పోల్‌ అవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాత్రేయులుకు 1,401(0.83%) ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీ రాజబాబు 1,212(0.72%) ఓట్లు సాధించారు. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ ఈ సారి వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది. 

Similar News

News November 18, 2025

కృష్ణా జిల్లాలో ఏడుగురు ఎస్ఐల బదిలీ

image

జిల్లాలో ఏడుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. VRలో ఉన్న కెవై దాస్‌ను చల్లపల్లి SIగా, నాగ శివనాధ్‌ను DCRB SIగా బదిలీ చేశారు. చల్లపల్లి SI PSV సుబ్రహ్మణ్యం ఇనగుదురు SI-1గా, కోడూరు SI శిరీషను కూచిపూడి SIగా, ఇనగుదురు SI-1 YVV సత్యనారాయణను DTC పెదవేగి ఏలూరు జిల్లాకు, గుడివాడ వన్ టౌన్ SI గౌతమ్ ను అవనిగడ్డ SI-2గా బదిలీ చేస్తూ SP విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

News November 18, 2025

మంగళగిరి: భార్యని హత్య చేసిన భర్త

image

గుంటూరు(D) మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ(29) ఐదేళ్ల క్రితం శంకర్ రెడ్డిని పెళ్ళి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భర్త శంకరరెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

News November 18, 2025

మచిలీపట్నంలో మరో ప్రాజెక్ట్‌కు ఒప్పందం

image

మచిలీపట్నంకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.6500 కోట్లతో గోవా షిప్ యార్డ్ నిర్మాణం జరగనుంది. ఇటీవల విశాఖలో జరిగిన CII సదస్సులో గోవా షిప్ యార్డ్ సంస్థ ప్రభుత్వంతో MOU చేసుకుంది. గోవా షిప్ యార్డ్ నిర్మాణం ద్వారా 6వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోవా షిప్ యార్డ్ నిర్మాణం కూడా జరిగితే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే.