News January 27, 2025
గుడివాడ: కొత్త ఆటోలో తీసుకెళ్లి ప్రాణం కాపాడాడు..!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడిన ఆటో డ్రైవర్ కందుల శ్యామ్కు ఏలూరు కలెక్టర్ రూ.5వేలు, ప్రాణ దాత అవార్డు అందజేశారు. లింగాల గ్రామానికి చెందిన కాటి నిరీక్షణ బాబు కానుకొల్లు వద్ద నవంబరు 28న బైకుపై వెళ్తూ అదుపుతప్పి కిందిపడిపోయాడు. అటుగా ఫ్యామిలీతో కొత్త ఆటోలో వస్తున్న కందుల శ్యామ్, నల్లగుడ్ల రాజు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాబును గుడివాడ ఆసుపత్రిలో చేర్చారు.
Similar News
News February 15, 2025
గన్నవరం: కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను అపహరించిన కేసులో శుక్రవారం పటమట పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు వంశీబాబు, గంటా వీర్రాజును అరెస్ట్ చేశారు. వంశీబాబు కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ అరెస్టుతో సత్యవర్ధన్ను అపహరించిన కేసులో మొత్తంగా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, రామకృష్ణ జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
News February 14, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

వల్లభనేని వంశీ అరెస్ట్ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.
News February 14, 2025
కృష్ణా: నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది వీరేనా.?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో అదే పార్టీకి చెందిన కొందరు వైసీపీ నాయకులపై కూడా కేసులో ఉన్నాయి. వీరిని కూడా ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఆయనే సూత్రధారుడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పేర్ని నాని బియ్యం మాయం కేసులో బెయిల్పై ఉన్నారు.