News January 27, 2025
గుడివాడ: గవర్నర్ నజీర్ను కలిసిన ఎమ్మెల్యే రాము

76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్ నజీర్ ఎమ్మెల్యే రాముతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .
Similar News
News December 21, 2025
కృష్ణా: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?
News December 21, 2025
బందరు – ప్రయాగ్రాజ్ మధ్య ప్రత్యేక రైలు

పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం – ప్రయాగ్రాజ్ (07401) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 22న సాయంత్రం 4:20 గంటలకి మచిలీపట్నంలో బయలుదేరి.. గుడివాడ, విజయవాడ, వరంగల్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇందులో ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
News December 20, 2025
కృష్ణా: మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ నడిపిన కలెక్టర్

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగంగా కృష్ణా కలెక్టరేట్లో శనివారం ‘క్లీన్ & క్లీన్’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ వినూత్నంగా స్పందించారు. స్వయంగా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టరును నడిపి, ప్రాంగణంలోని వ్యర్థాలను సేకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని కలెక్టరేట్ మూలమూలలా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.


