News March 3, 2025

గుడిహత్నూర్‌లో బాలిక సూసైడ్

image

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.

Similar News

News March 21, 2025

స‌జావుగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు: కలెక్టర్ 

image

ఎన్టీఆర్ జిల్లాలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో స‌జావుగా సాగుతున్నాయ‌ని, పొర‌పాట్ల‌కు తావులేకుండా ప‌రిస్థితిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ సూర్యారావుపేట‌లోని క‌ర్నాటి రామ్మోహ‌న్‌రావు మునిసిప‌ల్ ఉన్న‌త‌పాఠ‌శాల ప‌రీక్ష కేంద్రంలో ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. విద్యార్థులు ప‌రీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను అయన ప‌రిశీలించారు. 

News March 21, 2025

గుడిహత్నూర్‌లో క్లినిక్ సీజ్

image

గుడిహత్నూర్‌లోని ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. సూర్యవంశీ అనే RMP వైద్యుడు తన పరిధికి మించి ఓ గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న DMHO డా.నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు అధికారులు సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు. జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న RMPలు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, పరిధికి మించి వైద్యం అందిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2025

అల్లూరి జిల్లాలో 89మంది విద్యార్థులు గైర్హాజర్

image

అల్లూరి జిల్లాలో శుక్రవారం 71పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ జరిగింది. వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 11547మంది విద్యార్థులకు 11458మంది హాజరయ్యారని, 89మంది ఆబ్సెంట్ అయ్యారని DEO. బ్రాహ్మజీరావు తెలిపారు. చింతపల్లిలో 4 సెంటర్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

error: Content is protected !!