News March 6, 2025

గుడి ధ్వంసం.. MLA, అధికారులపై ఫిర్యాదు

image

లోయపల్లిలో గుడి ధ్వంసం చేసిన అధికారులపై, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి‌పై జాతీయ ST కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర కమిషన్‌కు అధ్యక్షుడు డా.కల్యాణ్ నాయక్, రంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా ఫిర్యాదు చేశారు. గత నెల 25న సేవాలాల్ మహారాజ్ గుడిని కొందరు కుట్రపూరితంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీని సస్పెండ్ చేయాలని, ST/SC కేసు నమోదు చేయాలని కోరారు.

Similar News

News July 8, 2025

HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో 2.5 టన్నుల ఈ-వేస్ట్‌ తొలగింపు.!

image

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్‌ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్‌ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.

News July 8, 2025

బడిబాటలో హైదరాబాద్ టాప్

image

బడిబాట‌లో హైదరాబాద్‌ రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడడంతో ఆదరణ పెరుగుతోంది. అధికారుల విస్తృత ప్రచారంతో కొత్త అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఈ ఏడాది గవర్నమెంట్ స్కూల్లో 1st క్లాస్‌లో HYD-6359, మేడ్చల్‌- 2962, రంగారెడ్డి-2127 అడ్మిషన్లు వచ్చాయి. ఇక 2వ తరగతి నుంచి పదో తరగతి వరకు HYD-9,674, మేడ్చల్‌-5262, రంగారెడ్డి-3642 మంది విద్యార్థులు సర్కారు బడిలో చేరారు.

News July 8, 2025

HYD: బతుకమ్మ కుంట బతికింది!

image

అంబర్‌పేట‌లోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసింది హైడ్రా. కబ్జా చెర నుంచి విడిపించి, అదే స్థాయిలో సుందరీకరిస్తోంది. తాజాగా బతుకమ్మ కుంట ఫొటోలను విడుదల చేసింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి ఉన్న 5 ఎకరాల 15 గుంటలు ఇప్పుడు నిండు కుండలా మారింది. సెప్టెంబర్‌లోపు సుందరీకరణ పనులు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దసారకు ‘బతుకమ్మ’ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది అనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్?