News February 24, 2025
గుడ్ న్యూస్.. రేపు ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం SR&BGNR డిగ్రీ కళాశాలలో ప్లేస్ మెంట్ సెల్, తెలంగాణ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మహ్మద్ జాకిరుల్లా తెలిపారు. టెక్ మహీంద్రా, జెన్ ప్యాక్ట్, ముత్తూట్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, క్యూస్ కారప్స్ లిమిటెడ్, హెల్త్ కేర్ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.
Similar News
News February 24, 2025
స్టూడెంట్గా మారిన ఖమ్మం జిల్లా కలెక్టర్

పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ పాఠశాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థిగా మారి వారి పక్కన కూర్చొని టీచర్ చెప్పిన క్లాస్ను విన్నారు. అనంతరం ఆయన కూడా క్లాస్ చెప్పారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. రాబోయే నెల రోజుల పాటు ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాలలో వసతులను పరిశీలించారు.
News February 24, 2025
ఖమ్మం: పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్

రాబోయే పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్, మార్చి 21-ఏప్రిల్ 4 వరకు పదో పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 72 ఇంటర్, 97 పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల భద్రత, ట్రాన్స్పోర్ట్, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News February 24, 2025
ఖమ్మం: శ్రీనివాసరావు పార్థివదేహానికి మంత్రి నివాళి

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో సోమవారం ఆకస్మికంగా మృతిచెందడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి తుమ్మల వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.