News November 15, 2024

గుత్తి: డబుల్ రైల్వే లైన్‌కు భూముల పరిశీలన

image

గుత్తి-పెండేకల్లు రైల్వే డబుల్ లైన్ పనులు త్వరలో జరగనున్నాయి. వీటికి చెట్నేపల్లి సమీపంలోని భూములను కేటాయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం వీటిని పరిశీలించారు. మ్యాపులను వీక్షించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ ఓబులేసు, రైల్వే సెక్షన్ ఆఫీసర్ విమలేష్ కుమార్, సర్వేయర్ శేష సాయి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 21, 2025

సర్ధార్@150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్

image

సర్ధార్ @150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో సర్ధార్ 150@ యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ పాదయాత్ర పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 31న నిర్వహించబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువతీ, యువకులకు సూచించారు.

News October 21, 2025

‘రిజర్వేషన్ అమలులో మహా మోసం’

image

రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మహా మోసం జరిగిందని రిజర్వేషన్ సాధికార సమితి అధ్యక్షుడు జీవీ ఉజ్వల్ ఆరోపించారు. అనంతపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాలలో రిజర్వేషన్ కటాఫ్ కంటే ఓపెన్ కటాఫ్ తక్కువ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. జీవో 77లో ఓపెన్ క్యాటగిరీ పోస్టులు నింపిన తర్వాతే రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాలనే నిబంధన స్పష్టంగా ఉందన్నారు.

News October 21, 2025

గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యం

image

అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, ఓ కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులకు ఎస్పీ అభినందించారు.