News July 1, 2024
గుమ్మఘట్ట: బీటీ ప్రాజెక్టులో చేపల వేట నిషేధం

గుమ్మఘట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టులో జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు గుమ్మఘట్ట ఎఫ్ డీ ఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సమయంలో చేపలు తమ సంతానోత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి వేటకు దూరంగా ఉండాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేట సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 26, 2025
జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.
News November 26, 2025
జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.
News November 26, 2025
వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి: కలెక్టర్

ప్రజలందరికీ భాగస్వామ్యంతో వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురంలోని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో నిర్వహించిన ప్రపంచ వారసత్వ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.


