News February 14, 2025
గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి: హరీశ్రావు

పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనకి మాజీ మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండని, డంపింగ్ యార్డ్ వద్దంటే మొండిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. CM రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నాడని, వందల మందిని పోలీస్ స్టేషన్లలో పెట్టి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడన్నారు.
Similar News
News November 25, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారికి అర్చకులు మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మార్గశిర మాసం, మొదటి మంగళవారం, పంచమి తిథి సందర్బంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News November 25, 2025
‘వేములవాడ రాజన్నా.. నీ సొమ్ము భద్రమేనా..?’

వేములవాడ రాజన్న స్వామి దేవస్థానం సొమ్ము భద్రమేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సత్తమ్మ అనే పత్తి రైతు ఆధార్ నంబర్కు రాజన్న ఆలయ ట్రస్టు బ్యాంకు ఖాతా లింకై ఉన్నట్లు వెలుగులోకి రావడంతో ఆలయ సొమ్ము భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వ్యక్తి ఆధార్ కార్డు ప్రభుత్వ అధీనంలో ఉండే ఆలయ ట్రస్టు ఖాతాకు అనుసంధానం కావడానికి కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది. దీనిపై విచారణ చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News November 25, 2025
జన్నారం: ‘ధాన్యంలో 17% లోపు తేమ ఉండాలి’

17% లోపు తేమ ఉంటేనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని జన్నారం మండలం దేవునిగూడెం క్లస్టర్ ఏఈఓ అక్రమ్ అన్నారు. మంగళవారం క్లస్టర్ పరిధిలోని దేవునిగూడెం, కామన్ పల్లి గ్రామ శివారులో ఎండకు ఆరబోసిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రాత్రి వేళల్లో మంచి ఎక్కువగా పడుతుందని, దీంతో తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యంపై కవర్లను తప్పకుండా కప్పాలని రైతులకు ఏఈఓ అక్రమ్ సూచించారు.


