News April 4, 2025

గుమ్మడిదల: నాటు తుపాకీ, గంజాయి స్వాధీనం

image

నాటు తుపాకీ, గంజాయిని గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు. జిన్నారం CI నయీముద్దీన్ వివరాలు.. బీహార్‌కు చెందిన భూపేంద్ర కుమార్ ఆరేళ్లుగా దోమడుగులో కిరాయికి రూమ్ తీసుకొని శ్యామ్ పిస్టమ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జీతం సరిపోక ఎక్కువ డబ్బు సంపాదించాలని బీహార్ నుంచి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు అతడి ఇంటిని తనిఖీ చేయగా నాటు తుపాకీ, 2 బుల్లేట్లు, 930 గ్రాముల గంజాయి పట్టుబడింది.

Similar News

News October 16, 2025

నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులకు CPRపై శిక్షణ

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో CPR (Cardio Pulmonary Resuscitation)పై జిల్లా అధికారులకు ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. “ప్రస్తుతం హార్ట్ అటాక్‌ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో CPR ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు” అని తెలిపారు.

News October 16, 2025

నారాయణపేట జిల్లా ఎస్పీ ముఖ్య గమనిక

image

నారాయణపేట జిల్లాలో బాణాసంచా విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 1884, 2008 చట్టాల ప్రకారం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. పెట్రోల్ బంకు, రద్దీ స్థలాలు, ట్రాన్స్‌ఫార్మర్, వివాదాస్పద స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. తహశీల్దార్, పోలీసులు చూపించిన స్థలంలోనే బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

News October 16, 2025

నాగర్‌కర్నూల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశం

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులను ఎలాంటి ఒత్తిడికి గురి చేయకూడదని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన తెలిపారు.