News March 30, 2024
గురజాలలో లోకల్ మేనిఫెస్టో డైలాగ్ వార్

గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య లోకల్ మేనిఫెస్టోపై డైలాగ్ వార్ నడుస్తోంది. యరపతినేని ఆరు అంశాలతో లోకల్ మ్యానిఫెస్టో ప్రకటించగా అది సమగ్రంగా లేదని కాసు విమర్శించారు. 30 ఏళ్ల పాటు తనను ఆదరించిన ప్రజలకు వ్యక్తిగత ఖర్చులతో మేనిఫెస్టో రూపొందించామని యరపతినేని అన్నారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై కాసు కూడా 10 అంశాలతో లోకల్ మేనిఫెస్టో ప్రకటించారు.
Similar News
News September 19, 2025
సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
News September 18, 2025
నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూలై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ II సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% సాధించాయి. గణితశాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదు అయింది. రీవాల్యూషన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 26.
News September 18, 2025
GNT: సీజనల్ వ్యాధుల సమాచారానికి కంట్రోల్ రూమ్

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాదులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.