News March 30, 2024
గురజాలలో లోకల్ మేనిఫెస్టో డైలాగ్ వార్

గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య లోకల్ మేనిఫెస్టోపై డైలాగ్ వార్ నడుస్తోంది. యరపతినేని ఆరు అంశాలతో లోకల్ మ్యానిఫెస్టో ప్రకటించగా అది సమగ్రంగా లేదని కాసు విమర్శించారు. 30 ఏళ్ల పాటు తనను ఆదరించిన ప్రజలకు వ్యక్తిగత ఖర్చులతో మేనిఫెస్టో రూపొందించామని యరపతినేని అన్నారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై కాసు కూడా 10 అంశాలతో లోకల్ మేనిఫెస్టో ప్రకటించారు.
Similar News
News February 9, 2026
స్వల్ప వృద్ధితోనే గుంటూరు జిల్లా ఆదాయ వసూళ్లు

గుంటూరు జిల్లా మున్సిపల్ ఆదాయ వసూళ్లలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం వసూలు చేయాల్సింది ₹452.15 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరి 9 వరకు వసులుచేసింది ₹152.35 కోట్లు మాత్రమే అది 33.70%గా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ₹152.29 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది స్వల్పంగా 3.90% వృద్ధి నమోదైంది. లక్ష్య సాధనలో ఇంకా వేగం పెంచాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
News February 8, 2026
GNT: వెహికల్ చెకింగ్.. రూ.5లక్షల జరిమానా, 72 సీజ్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పోలీసులు రహదారి భద్రతా డ్రైవ్ చేపట్టారు. మొత్తం 2,436 వాహనాలను ప్రధాన కూడళ్లల్లో తనిఖీ చేశారు. త్రిపుల్ రైడింగ్, అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, మైనర్ల డ్రైవింగ్ని గుర్తించి
933 వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు రూ.5,67,590 జరిమానా విధించారు. ధృవపత్రాలు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేశారు.
News February 8, 2026
GNT: రేపు ఎస్పీ ఆఫీసులో PGRS రద్దు

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు గమనించాలని చెప్పారు.


