News August 5, 2024
గురుకులాల్లో ఉద్యోగాలు.. నేడే చివరి అవకాశం

జిల్లాలోని 7 అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO T.పద్మజ తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు అర్హులైన వారు గురుకుల పాఠశాలలో దరఖాస్తులను అందజేయాలన్నారు. B.Edతో పాటు TET అర్హత సాధించిన వాళ్లు అర్హులు. ఈనెల 6న చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు డెమో క్లాసు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Similar News
News November 1, 2025
పరకామణి కేసులో నిందితుడు, ప్రతివాదులకు నోటీసులు…!

పరకామణి కేసులో ప్రధాన నిందితుడైన సీవీ రవి కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రతివాదులైన అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ సెక్రటరీ, ఏపీ లీగల్ సర్వీస్ సెక్రటరీ, సీఐడీ డీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్వో, తిరుమల – 1 టౌన్ సీఐలతో పాటు మరి కొందరికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొంది.
News October 31, 2025
CTR: పదేళ్ల నుంచి జైల్లోనే ఆ ఇద్దరు..!

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. 2015 నవంబర్ 15న హత్య జరిగిన తర్వాత ఐదుగురు అరెస్ట్ అయ్యారు. పలువురికి కండిషన్ బెయిల్ వచ్చింది. ఇదే కేసులో A3గా ఉన్న జయప్రకాశ్, ఏ4 మంజునాథ్కు చాలా కారణాలతో బెయిల్ రాలేదు. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటికీ జైల్లోనే జీవితం గడుపుతున్నారు. మిగిలిన వాళ్లు జైలు నుంచి విడుదలయ్యారు. తీర్పు రావడంతో మరోసారి జైలుకు వెళ్లారు.
News October 31, 2025
ఇంజినీరింగ్ చదివిన చింటూ.. చివరకు!

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో A1 నిందితుడైన, ఉరిశిక్ష పడ్డ చింటూ అలియాస్ చంద్రశేఖర్.. <<18157620>>కఠారి మోహన్కు మేనల్లుడు<<>>. ఇంజినీరింగ్ చేసి మంచి ఉద్యోగం చేసే చింటూ మామకోసం ఆయన వెంట నడిచాడు. సీకే బాబుపై 2007లో జరిగిన బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగు కేసులో యావజ్జీవ శిక్ష పడినా, తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత అన్ని విషయాల్లో తలదూర్చి వ్యక్తిగత, ఆర్ధిక, పవర్ విభేదాలతో మేనమామ దంపతులను హత్య చేశాడు.


