News March 13, 2025

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏపీ గురుకుల పాఠశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి 5,6,7,8 తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశానికి 80సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 6,7,8 తరగతిలో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో కోరారు. ఆసక్తి గలవారు https://aprs.ofss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

Similar News

News December 4, 2025

వీధికుక్కలు వెంబడిస్తే ఇలా చేయకండి!

image

బైకర్లను వీధికుక్కలు వెంబడించి భయపెట్టడం తెలిసిందే. ఈ సమయంలో కొందరు వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి గురవుతుంటారు. నిన్న వరంగల్(D) మచ్చాపూర్‌లో కుక్కల భయానికి ఓ వ్యక్తి బైక్‌ను వేగంగా నడుపుతూ అదుపుతప్పి డ్రైనేజీలో పడి చనిపోయాడు. కుక్కలు వెంబడిస్తే బైక్‌ను వేగంగా నడపొద్దు. గట్టిగా అరిస్తే అవి మరింత రెచ్చిపోతాయి. రియాక్ట్ అవ్వకుండా ఉంటే అవి సైలెంట్ అవుతాయి. వాటి కళ్లలోకి నేరుగా చూడకండి.

News December 4, 2025

సిరి ధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో లాభం

image

చిరు ధాన్యాల సాగు, వినియోగం క్రమంగా పెరుగుతోంది. వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలే దీనికి కారణం. చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ని, BP, షుగర్, గుండె వ్యాధుల ముప్పును తగ్గించి రక్తహీనతను దూరం చేస్తాయి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు తొందరగా అలసిపోకుండా ఉండేందుకు మిల్లెట్స్ దోహదపడతాయి.

News December 4, 2025

కొత్త ఏడాదిలోనే మార్కాపురం జిల్లా..!

image

నూతన సంవత్సరం వస్తూ వస్తూ.. మార్కాపురం డివిజన్ ప్రజల కలను నెరవేరుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ప్రకటనకు పచ్చజెండా ఊపారు. అయితే ఈనెల 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు గడువు ఉంది. దీనిని బట్టి 2026 రావడంతోనే, కొత్త జిల్లా అధికారిక ప్రకటన రానుంది. 2026 జనవరి 1 రోజే అధికారిక ఉత్తర్వులు రావచ్చని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద కొత్త ఏడాది కొత్త కబుర్లు తీసుకురానుందని ప్రజలు అంటున్నారు.