News March 13, 2025
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏపీ గురుకుల పాఠశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి 5,6,7,8 తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశానికి 80సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. 6,7,8 తరగతిలో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో కోరారు. ఆసక్తి గలవారు https://aprs.ofss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
Similar News
News November 13, 2025
ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్లు ఉన్నాయి.
News November 13, 2025
ప.గో: వైసీపీలో ఆరుగురికి కీలక పదవులు

వైసీపీ రాష్ట్ర కార్యవర్గంలో పలువురిని కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. పేరిచర్ల విజయ నరసింహారాజు, ముప్పిడి సంపత్ కుమార్, యడ్ల తాతాజీ, కొట్టు నాగేంద్ర (పశ్చిమగోదావరి ), నూకపెయ్యి సుధీర్ బాబు, డీ వీ ఆర్ కే. చౌదరి (ఏలూరు) నియమితులయ్యారు.
News November 13, 2025
సంగారెడ్డి: టెన్త్ ఫీజు గడువు నేడే లాస్ట్.!

పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు నేటితో (గురువారం) ముగియనున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఫీజు చెల్లించని వారు సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


