News September 8, 2024
గూడూరులో భారీగా గంజాయి స్వాధీనం

గూడూరు బైపాస్ జంక్షన్లో శనివారం సాయంత్రం గంజాయి దొరికింది. అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురి నుంచి 30 కేజీల 900 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. వీరు వైజాగ్ నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 23, 2025
పెన్నానది ఐలాండ్లో 12 మంది అరెస్ట్

ఇందుకూరుపేట(M) కుడితిపాలెం సమీపంలోని పెన్నా నది ఐలాండ్లో పేకాటాడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. SP అజిత పర్యవేక్షణలో రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు చేపట్టారు. డ్రోన్ కెమెరా ద్వారా పేకాట రాయుళ్ల కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3లక్షల నగదు, 3కార్లు, 6 బైక్లు, 14 ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News November 23, 2025
నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


