News July 6, 2024
గూడూరు: ఈ నెల 15 నుంచి పలు మెము రైళ్లు రద్దు

నిర్వహణ పనుల నిమిత్తం పలు మెము రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ నుంచి గూడూరుకు వచ్చే 07500, 12744 రైళ్లు ఈ నెల 15 నుంచి 30 వరకు, గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 07458, 12743 రైళ్లు ఈనెల 16 నుంచి 31 వరకు రద్దయ్యాయి. గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 17259, విజయవాడ నుంచి గూడూరు వెళ్లే 17260 రైళ్లను 16, 23, 30 తేదీలలో నిలిపివేసినట్లు తెలిపారు.
Similar News
News October 20, 2025
భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్

జిల్లాలో ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయని, ఇంకా కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో సూచించారు. తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదనీ, వెళ్లినా వెంటనే వచ్చేయాలని సూచించారు.
News October 19, 2025
నెల్లూరు: చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు ఎప్పుడు..?

చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 100 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో చేనేతలు కరెంట్ బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ జీవో విడుదలైంది కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
News October 19, 2025
నెల్లూరు జనసేన వివాదంపై త్వరలో విచారణ!

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఇటీవల ఏర్పడిన వివాదాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్గా దృష్టి సారించారు. జిల్లా ముఖ్య నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్పై కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ సీనియర్ నాయకులను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పార్టీ రాష్ట్ర MSME ఛైర్మన్ శివశంకర్ను విచారణకు పంపనున్నారు.