News March 9, 2025

గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

image

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 21, 2025

మెదక్: 10338 మందికి  68 సెంటర్లు

image

నేటి నుంచి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లలో 10338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 సెట్టింగ్స్ స్క్వాడ్స్, 68 చీఫ్ సూపర్డెంట్లు, 70 డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.

News March 21, 2025

నల్గొండ: మూల్యాంకనం తేదీలో మార్పు..!

image

ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి ఈనెల 22న జరగాల్సిన మూల్యాంకనం 21వ తేదీ (శుక్రవారం)కి మార్చినట్లు డీఐఈఓ దస్రూ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 21, 2025

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మండలంలో బసంతనగర్ మరియు జయ్యారం ప్రభుత్వ పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంఈఓ విమల తెలిపారు. బసంతనగర్ 261 జయ్యారంలో 97 మంది రెండు కేంద్రాలలో కలిపి 358 మంది పరీక్షలు రాయనున్నారని అలాగే పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయని  తెలిపారు.

error: Content is protected !!