News October 22, 2024

గూడూరు: చనిపోయింది టీడీపీ కార్యకర్త..!

image

గూడూరు నియోజవర్గం చిల్లకూరు(M) నాంచారంపేటలో సోమవారం రాత్రి ఒకరు దారుణ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడు మల్లారపు హరిప్రసాద్(20)గా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న హరిప్రసాద్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హరిప్రసాద్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. వైసీపీ నాయకుడే ఇలా చేయించారని బంధువులు ఆరోపిస్తున్నారు.

Similar News

News October 29, 2025

మన నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా

image

కలెక్టర్ హిమాన్షు శుక్ల సాధారణ వ్యక్తిలా మారి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి పునరావాస కేంద్రంలో చిన్నారులకు పాఠాలు చెప్పి వారిని నవ్వించారు. అలాగే వారితో గడిపిన క్షణాలను గుర్తు పెట్టుకొనేందుకు సెల్ఫీ తీసుకున్నారు. కలెక్టర్ స్థాయిలో బాధితులపై ఆయన చూపిన ప్రేమకు అక్కడివారు ముగ్దులయ్యారు.

News October 29, 2025

కావలిలో భారీ వర్షపాతం నమోదు

image

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.

News October 29, 2025

నెల్లూరులో Photo Of The Day

image

నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాత్రి, పగలు, వర్షం అనే తేడా లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. నెల్లూరు రూరల్ కొండ్లపూడిలోని పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆ ఇద్దరూ అక్కడే భోజనం చేసి వారికి భరోసా కల్పించారు.