News September 11, 2024
గూడూరు: డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట

తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట బుధవారం గూడూరు డీఎస్పీని ఆశ్రయించింది. గూడూరు పట్టణానికి చెందిన సాయికుమార్, బళ్లారికి చెందిన దివ్య గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో వారే పెళ్లిచేసుకుని డీఎస్పీని ఆశ్రయించారు. తమతల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు. ప్రస్తుతం వారి జంట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 4, 2026
ఒక్కొక్కడికి దూల తీరుస్తా: ఉదయగిరి ఎమ్మెల్యే

ఉదయగిరిలో ఓ పెద్ద మనిషి <<18759752>>నీచంగా<<>> ఆలోచించి మహిళతో ఆరోపణలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ అన్నారు. ‘నేను విజయవాడలోని ఓ హోటల్లో ఉన్నప్పుడు వెంగమాంబను అక్కడికి రప్పించి తప్పుడుగా వీడియోలు చిత్రీకరించాలని చూశారు. అప్పటి నుంచి నాతో సహా మా టీం అంతా ఆమెను దూరం పెట్టింది. నన్ను ఏదో చేస్తే వెళ్తాననుకుంటున్నారు. 25ఏళ్లు ఉదయగిరిలోనే ఉంటా. ఒక్కొక్కడికి దూల తీరుస్తా’ అని కాకర్ల హెచ్చరించారు.
News January 4, 2026
వెంగమాంబ ఆరోపణలు అవాస్తవం: కాకర్ల

ఉదయగిరి MLA కాకర్లపై వెంగమాంబ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. ‘ఆమెను రెండుమూడు సార్లు కారులో ఎక్కుంచుకున్న విషయం నిజమే. అప్పుడు నా భార్య కూడా ఉంది. కానీ ఆమె ఆరోపణల్లో నిజం లేదు. ఆమె మూడు నెలలు మాత్రమే మా నియోజకవర్గంలో పని చేశారు. MLA టికెట్ TDP తరఫున చంద్రబాబు ఇస్తారు. నేను ఎలా ఇస్తాను. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసు. వారిపై లీగల్ గా వెళుతున్నాం’ అని కాకర్ల స్పష్టం చేశారు.
News January 4, 2026
నెల్లూరు: కారులో తనిఖీలు.. భారీగా బంగారం సీజ్

కారులో ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను GST, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా కారులో ఉన్న రూ.3.7 కోట్ల విలువజేసే 3.1 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ట్రెజరీలో భద్రపర్చారు. సదరు వ్యక్తి వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.


