News August 10, 2024
గూడూరు: బావ చేతిలో బామ్మర్ది హత్య

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు బనిగిసాహెబ్ పేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బావ, బామ్మర్ది మధ్య ఏర్పడిన ఘర్షణలో.. బామ్మర్ది జాకీర్, ఆయన చెల్లెలిపై బావ అల్లాబక్షు రోకలి బండతో దాడి చేశాడు. ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా జాకీర్ మృతి చెందాడు. ఆయన చెల్లెలి పరిస్థితి విషయంగా ఉంది.
Similar News
News October 15, 2025
పింఛన్ల పునఃపరిశీలన మూడు రోజులు పాటు బంద్

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పింఛన్ల పునఃపరిశీలన కార్యక్రమాన్ని మూడు రోజులు పాటు నిలిపివేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సచివాలయ సంబంధ శాఖ అధికారులు దివ్యాంగులకు తెలియజేయాలని సూచించారు.
News October 15, 2025
నెల్లూరు TDP నేతల తీరుపై పల్లా ఆగ్రహం..?

జిల్లా TDP నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడంపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలకు ఫోన్లు చేసి పార్టీ క్రమశిక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, దానిని కాపాడుకోవాలని హితవు పలికారట.
News October 14, 2025
అనధికార MIHM ఫంక్షన్ హాల్ సీజ్

హై కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని కోటమిట్టలో ఉన్న అన్నధికారికంగా చేపట్టిన MIHM ఫంక్షన్ హాల్ను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. దీని తరువాత కార్యాచరణ నిమిత్తం దీన్ని ఫంక్షన్ హాల్ యాజమాన్యం సమక్షంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఎలక్ట్రికల్ సిబ్బంది సీజ్ చేయడం చేశారు.