News December 18, 2024

గూడూరు : మెమూ రైలు వేళల్లో మార్పులు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం వెళ్లే మెమూ రైలు వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం. 06745 గతంలో సూళ్లూరుపేట నుంచి ఉదయం 7.55 కు బయలుదేరేది. ఇప్పుడు 8.10కి బయలుదేరుతుంది. అలానే గూడూరుకు 8.55 కు చేరుకునే ఈబండి తాజాగా 9.27 కు చేరుకుంటుంది. నెల్లూరుకు గతంలో 10.05 కు చేరుకునే రైలు ఇప్పుడు 10.30 కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News February 27, 2026

మనుబోలు: రూ.4లక్షలతో పెట్రోల్ బంక్ ఉద్యోగి పరార్

image

నమ్మకంగా ఉంటూనే నగదుతో ఉడాయించిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. వెంకన్నపాలెంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో మేనేజర్ కమ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న కొలనుకుదురుకు చెందిన కుమార్ బంకులోని రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఏడాదిగా పనిచేస్తున్న అతడు నగదుతో కనిపించకుండా పోవడంతో యజమాని రాజశేఖర్ రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News February 27, 2026

నెల్లూరు: అంతా ఒకే.. తరువాత ఏంటి.!

image

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ కుర్చీ కొమ్ములాట సమసిపోయింది. రిజర్వేషన్ ప్రకారమే దేవరకొండ సుజాతకు పదవి దక్కింది. ఇక నుంచి NMCలో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయి. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న కొద్ది నెలల పదవీ కాలంలో సమస్యల పరిష్కారంలో ఏవిధంగా తన దైన మార్క్ చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

News February 27, 2026

నెల్లూరు: అంతా ఒకే.. తరువాత ఏంటి.!

image

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ కుర్చీ కొమ్ములాట సమసిపోయింది. రిజర్వేషన్ ప్రకారమే దేవరకొండ సుజాతకు పదవి దక్కింది. ఇక నుంచి NMCలో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయి. ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఉన్న కొద్ది నెలల పదవీ కాలంలో సమస్యల పరిష్కారంలో ఏవిధంగా తన దైన మార్క్ చూపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.