News December 3, 2024
గూడూరు: వరదలో కొట్టుకుపోయిన యువకులు

గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తాగేడు సమీపంలోని బాలచంద్ర రెడ్డి భవనం దగ్గర వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు బైకుపై మల్లాం వైపు వెళ్లేందుకు వాగు దాటేందుకు ప్రయత్నించారు. బైకుతో సహా ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరుకు చెందిన మధు రెడ్డి, ఒడిశాకు చెందిన షారుక్ కొట్టుకెళ్లినట్లు స్థానికులు గుర్తించారు.
Similar News
News February 14, 2026
NLR: ఇద్దరూ కలెక్టర్లే.. కానీ మంచి పేరెంట్స్ కూడా.!

ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు కలెక్టర్ <<19137448>>దంపతులు<<>> హిమాన్షు శుక్లా, కృతిక(పల్నాడు). వీరు ఒకే వృత్తిలో ఉంటూ ఉద్యోగానికి.. ఫ్యామిలీకి సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. వృత్తి రీత్యా ఇద్దరూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ వారానికో రోజు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు హిమాన్షు Way2Newsకు వివరించారు. ఓ వారం తాను.. మరో వారం తన భార్య నెల్లూరు to పల్నాడుకు జర్నీ చేస్తూ సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
News February 14, 2026
లవర్స్కు నెల్లూరు కలెక్టర్ సలహా ఇదే

నేటి యువత భవిష్యత్తులో స్థిరపడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే తమకు ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. <<19130524>>ప్రేమికుల రోజు<<>>ను పురస్కరించుకొని Way2Newsతో ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యువత మొదట చదువు పూర్తి చేసి, మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని వివరించారు. #Valentine’s Day
News February 14, 2026
నెల్లూరు: రైలు కిందపడి ఒకరి మృతి

నెల్లూరు రైల్వే స్టేషన్లో తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి మూడో నెంబర్కు వెళుతుండగా అకస్మాత్తుగా రైలు కదలడంతో రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడి వయస్సు 40-45 ఏళ్లు ఉంటుంది. ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు.


