News November 3, 2024
గూడూరు: హత్య కేసులో ముద్దాయిలు అరెస్టు

దీపావళి పండుగ రోజు రాత్రి చిల్లకూరు మండలం, కడివేడులో జరిగిన వెంకటేశ్ హత్య కేసులో ముద్దాయిలను చిల్లకూరు పోలీసులు అరెస్టు చేశారు. గూడూరు డిఎస్పీ వెంకటరమణ కేసు వివరాలు మీడియాకు తెలిపారు. మృతుడికి అదే గ్రామానికి చెందిన 1వ ముద్దాయి సుబ్రహ్మణ్యంకు పాత గొడవల కారణంగా సాయికుమార్, సునీల్ ల సాయంతో హత్య చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ, చిల్లకూరు ఎస్ఐ, వారి సిబ్బంది ఉన్నారు.
Similar News
News November 24, 2025
నెల్లూరు: నాడు 54.. నేడు 14.!

నెల్లూరు కార్పొరేషన్లో <<18375703>>YCP<<>> ఆధిపత్యానికి గండి కొడుతూ కూటమి నేతలు కార్పొరేటర్లను తన గూటికి లాగేసుకుంటున్నారట. 2021 NMC ఎన్నికల్లో YCP మొత్తం 54 కార్పొరేషన్ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికలనంతరం పరిస్థితి మారింది. మేయర్ స్రవంతిని అవిశ్వాస తీర్మానంతో గద్దె దించేందుకు 40 మంది కార్పొరేటర్లు TDP వైపు వెళ్లడంతో YCP బలం 14కు పడిపోయింది. ఇంకా మంది కూటమి గూటికి చేరుతామరో మరి.
News November 24, 2025
నెల్లూరు విద్యార్థులకు ఎవరెస్ట్ ఎక్కే ఛాన్స్.!

జిల్లాలోని 52 మంది దివ్యాంగ విద్యార్థులకు అపురూప సాహస యాత్ర అవకాశం దక్కింది. సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అడ్వెంచర్ స్పోర్ట్స్’కార్యక్రమానికి విద్యార్థులు ఎంపికయ్యారు. PMశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపితే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికవుతారు. ముందుగా వారు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలి. అందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News November 24, 2025
నెల్లూరు: మేయర్ పదవి కలిసిరాలేదేమో…

YCP హయాంలో NMC మేయర్గా పీఠం ఎక్కిన స్రవంతికి ఆ పదవి అచ్చోచ్చినట్లు లేదు. తమకెవరూ అడ్డురారనే ధీమాతో ఆనాడు మేయర్ భర్త జయవర్దన్ కార్పొరేషన్లో చక్రం తిప్పాడు. ఏకంగా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి జైలు పాలయ్యాడు. తిరిగి కోటంరెడ్డి చెంతకు చేరేందుకు పావులు కదిపినా సఫళీకృతం కాలేదు. అక్కడ్నుంచి మేయర్ అటు YCP, ఇటు TDPల మధ్య రాజకీయ పావుగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.


