News August 8, 2024

గూడూరు: RTC కార్యాలయం వద్ద ఎన్ఎంయు ధర్నా

image

గూడూరులోని ఆర్టీసీ కార్యాలయం వద్ద నేడు NMUA ఆధ్వర్యంలో పలువురు నేతలు ధర్నా చేశారు. ఆ సంస్థ స్టేట్ సెక్రటరీ చెంచులయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల డిపో మేనేజర్లు అనుచితంగా వ్యవహరిస్తున్నారని, వారిని వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను మానుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.  

Similar News

News September 20, 2025

TDPలో చేరిన MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి

image

MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది వరకే ఆయన YCPకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు CM చంద్రబాబు కండువా కప్పి TDPలోకి ఆహ్వానించారు. సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆయన వెంట సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, పులివర్తి నాని ఉన్నారు.

News September 20, 2025

వాహన మిత్ర పథకం దరఖాస్తు గడువు పెంపు – కలెక్టర్

image

వాహన మిత్ర పథకం దరఖాస్తు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కార్డ్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ఫిట్‌ నెస్‌ సర్టిఫికేట్‌ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు. గతంలో (2023 వరకు) ఈ పథకం కోసం దరఖాస్తు చేసిన వారు మరలా చేయాల్సిన అవసరం లేదన్నారు.

News September 20, 2025

ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల మౌలిక వసతుల కల్పనకు అడ్డంకులు ఉండవన్నారు.