News April 16, 2025
గూడెంకొత్తవీధి: RTC బస్సుకు తప్పిన ప్రమాదం

గూడెం కొత్తవీధి మండలం ధారకొండ – గుమ్మిరేవుల ఘాట్ రోడ్డులో మంగళవారం ప్రయాణికులతో వెళుతున్న బస్సుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఏత్తయిన కొండలపై కురిసిన వాన నీరు మాదిమళ్ళ గెడ్డకు పోటెత్తి వంతెన వద్ద ఉద్ధృతంగా ప్రవహించింది. అదే సమయంలో నర్సీపట్నం- గుమ్మిరేవుల బస్సు రోడ్ అప్రోచ్ ఎక్కుతూ బురదలో జారుకుంటూ వెనక్కు వచ్చేసింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది.
Similar News
News November 24, 2025
కల్వకుర్తి: భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎక్వాయిపల్లిలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
News November 24, 2025
అనకాపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

లోక్ అదాలత్ ద్వారా కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 13న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లోనూ లోక్ దాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను ఇరు పార్టీల వారు రాజీకి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివలన సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.
News November 24, 2025
బేబీ కార్న్ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.


