News January 23, 2025

గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు

image

3 దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్‌ పదవితో పాటు 5 వార్డు స్థానాలను ప్రభుత్వం షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేసింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్‌ ఇవ్వడం, నామినేషన్లు దాఖలు కాకపోవడం మామూలైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా ఈసారైనా రిజర్వేషన్‌ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

Similar News

News February 14, 2025

వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటలపాటు వాదనలు జరిగాయి. A1 వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

News February 14, 2025

జగిత్యాల: ఇద్దరు మహిళలు ARREST

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో గజేల్లి లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు కోరుట్ల సీఐ సురేశ్ బాబు గురువారం తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మౌనిక, రాయికల్‌లో నివాసం ఉంటున్న రాజేశ్వరి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారిని అరెస్టు చేశారు.

News February 14, 2025

దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడు MISSING

image

దుబాయ్ దేశంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన జెల్లబాల శంకర్(30) ఈనెల 6వ తారీఖున బ్రతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మరుసటి రోజు సోనాపూర్ క్యాంపు నుంచి బయటకు వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

error: Content is protected !!