News December 14, 2024
గూడెం దేవాలయంలో ట్రిబ్యునల్ ఛైర్మన్ పూజలు

దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సమేతంగా గూడెం గుట్ట దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు దేవాలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
ADB: 2వ బెటాలియన్ కమాండెంట్గా వెంకట్రాములు

ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడలోని 2వ బెటాలియన్ కమాండెంట్గా వెంకట్రాములు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సీనియర్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. దళాల శిక్షణ, క్రమశిక్షణ, ప్రజా బాధ్యతపై మొదటి ప్రధాన్యత ఉంటుందన్నారు. బెటాలియన్ ప్రతిష్టను మరింతగా పెంచేలా సమష్టిగా పనిచేస్తామని ఆయన అన్నారు.
News November 25, 2025
ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సూచన

సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, పత్తి పంట అవశేషాల దహనం వల్ల గాలి కాలుష్యం, భూసార, జీవవైవిధ్య నష్టం, భూమిలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి సమస్యలు ఏర్పడతాయని DAO శ్రీధర్ తెలిపారు. రైతులు వ్యవసాయ వ్యర్థాలను లేదా పంట అవశేషాలను కాల్చకుండా వాటిని కంపోస్ట్, వర్మీ కంపోస్ట్గా మార్చి లేదా భూమిలో కలియదున్నాలని, వ్యవసాయంలో సేంద్రియ ఎరువులుగా వినియోగించుకోవాలన్నారు. భూసారాన్ని సంరక్షించాలని అన్నారు
News November 25, 2025
ADB: ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న ఎస్బీఐకి చెందిన రెండు ఏటీఎంలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్తో ఏటీఎంలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఏపీ ప్రకాశం జిల్లా చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.


