News April 4, 2024
గెలిపిస్తే అభివృద్ధి చేస్తా: చెవిరెడ్డి భాస్కర్రెడ్డి

ప్రకాశం జిల్లాలోనే తన సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటానని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం పీసీపల్లి మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.
Similar News
News February 27, 2026
కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు హత్య చేశారు.!

గాలివీడులో <<19248603>>ఈ నెల 17న జరిగిన హత్య కేసులో<<>> నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరే ఈ హత్యకు కారణమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇతనితో పాటు నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన కుళాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాధరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 26, 2026
మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.
News February 26, 2026
వెలిగొండ పూర్తయితే 3 జిల్లాలకు ప్రయోజనం

కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. 43.5 TMCల వరద నీటిని నల్లమల్లసాగర్ రిజర్వాయర్ ద్వారా మళ్లించి 19.2 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2026కి పూర్తిచేస్తామని CM చంద్రబాబు పూనుకున్నారు.


