News March 20, 2025

గేట్‌లో సత్తా చాటిన సారపాక విద్యార్థి 

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన పంపన రమేశ్ కుమారుడు చరణ్ తేజ బుధవారం విడుదలైన గేట్ ఫలితాల్లో 1060వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. తాము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘనత సాధించిన విద్యార్థి చరణ్ తేజకు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News October 23, 2025

సిద్దిపేట: నేటి కేబినెట్ భేటీపై ఆశావహుల ఆశలు

image

నేడు జరుగనున్న కేబినెట్ భేటీపై ఆశావహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. నోటిఫికేషన్ వెలువరించటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి విడుదల చేయాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే యువతకు రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వయసు, బాధ్యతలు పెరిగి రాజకీయాలు చేయలేమని అంటున్నారు.

News October 23, 2025

ధర్మపురి: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ధర్మపురి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతి సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు MCA/ M.Sc కంప్యూటర్ సైన్స్‌లో 55% మార్కులు ఉన్నవారు Ph.D/ NET/ SET అర్హతగల అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలతో ఈనెల 24 శుక్రవారం రోజున నేరుగా కళాశాలలో హాజరుకావాలని ప్రిన్సిపల్ రాధ కిషన్ ఒక ప్రకటన ద్వారా కోరారు.

News October 23, 2025

సహకార సంస్థలు తమ డేటాను అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉన్న సహకార సంస్థలు తమ డేటాను జిల్లా సహకార అధికారికి అందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డేటాను నేషనల్ కో-ఆపరేటివ్ డేటా బేస్ పోర్టల్లో‌అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, వినియోగంలోకి తేవాలని సూచించారు.