News March 20, 2025

గేట్‌లో సత్తా చాటిన సారపాక విద్యార్థి 

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన పంపన రమేశ్ కుమారుడు చరణ్ తేజ బుధవారం విడుదలైన గేట్ ఫలితాల్లో 1060వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. తాము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘనత సాధించిన విద్యార్థి చరణ్ తేజకు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 21, 2025

MNCL: కంప్యూటర్ల విడి భాగాలు విక్రయం

image

మంచిర్యాల జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సేకరించిన ఉపయోగంలో లేని కంప్యూటర్ల విడి భాగాలను విక్రయించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 717 మానిటర్లు, 316 సీపీయు, 296 యుపిఎస్, 70 ప్రింటర్స్, 26 కంప్యూటింగ్ యూనిట్స్, 636 కేబుల్ కీ బోర్డ్స్, 288 మౌస్ ఉన్నట్లు పేర్కొన్నారు. కొనదలిచిన వారు రూ.10 వేలు ధరావత్తు సొమ్మును కొనే ధర కోడ్ చేసి సీల్డ్ కవర్‌లో ఈ నెల 25 సాయంత్రం 4 గంటల లోపు సమర్పించాలని సూచించారు.

News November 21, 2025

ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం

image

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ మొదలుకానుంది. క్రికెట్‌లో భారత్-పాక్ పోరు తర్వాత ఆ స్థాయిలో జరిగే ఏకైక సిరీస్ యాషెస్ మాత్రమే. 2010-11 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అక్కడ జరిగిన గత 3 సిరీస్‌లలో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోరంగా ఓడింది. ఓవరాల్‌గా యాషెస్‌లో ఆసీస్‌దే పైచేయి కావడం గమనార్హం.

News November 21, 2025

‘వికారాబాద్‌లో TET పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి’

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో టెట్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేక లేఖ రాశారు. జనవరి 3, 2026 నుంచి 31, 2026 వరకు జరగనున్న తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET–2026) పరీక్షలకు జిల్లాలోనే కేంద్రం ఉంటే స్థానిక అభ్యర్థులకు పెద్ద సౌకర్యం కలుగుతుందని తెలిపారు.