News March 20, 2025

గేట్‌లో సత్తా చాటిన సారపాక విద్యార్థి 

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన పంపన రమేశ్ కుమారుడు చరణ్ తేజ బుధవారం విడుదలైన గేట్ ఫలితాల్లో 1060వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. తాము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘనత సాధించిన విద్యార్థి చరణ్ తేజకు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 26, 2025

సేంద్రియ పెంపకం యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్

image

సేంద్రియ ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ కొత్తూరులోని చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతులు, పరిశుభ్రత ప్రమాణాలు, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ విధానాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

News November 26, 2025

బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

image

UP మీరట్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్‌లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.

News November 26, 2025

ఉర్విల్ ఊచకోత.. 10 సిక్సులు, 12 ఫోర్లతో..

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. 31 బంతుల్లోనే శతకం బాదారు. మొత్తంగా 37 బంతుల్లో 10 సిక్సులు, 12 ఫోర్లతో 119* రన్స్ చేశారు. తొలుత సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 182/9 స్కోర్ చేయగా, ఉర్విల్ ఊచకోతతో గుజరాత్ 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా T20లలో ఫాస్టెస్ట్ సెంచరీ ఉర్విల్ పేరుమీదనే ఉంది. 2024లో త్రిపురపై 28 బాల్స్‌లోనే శతకం చేశారు.