News March 20, 2025
గేట్లో సత్తా చాటిన సారపాక విద్యార్థి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన పంపన రమేశ్ కుమారుడు చరణ్ తేజ బుధవారం విడుదలైన గేట్ ఫలితాల్లో 1060వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. తాము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘనత సాధించిన విద్యార్థి చరణ్ తేజకు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News September 17, 2025
పుట్టపర్తి: సైబర్ నేరాలపై అవగాహన

శ్రీసత్య సాయి జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు, మహిళలకు, శక్తి యాప్, సైబర్ నేరాలపై శక్తి టీం బృందాలు అవగాహన కల్పించాయి. మహిళ పిఎస్ స్టేషన్ డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలకు, బాలికలకు పాఠశాల, కళాశాలలో విద్యార్థినిలకు శక్తి యాప్, సైబర్ నేరాలు, డ్రగ్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, ఈవ్ టీజింగ్ లపై విస్తృత అవగాహన కల్పించాయి.
News September 17, 2025
శుభ సమయం (17-09-2025) బుధవారం

✒ తిథి: బహుళ ఏకాదశి రా.1.25 వరకు
✒ నక్షత్రం: పునర్వసు ఉ.9.43 వరకు
✒ శుభ సమయములు: ఉ.9.45-ఉ.10-08, సా.7.10-సా.7.40
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: సా.5.29-సా.7.02
✒ అమృత ఘడియలు: ఉ.7.24-ఉ.8.56
News September 17, 2025
సిద్దిపేట: ‘RTI-2005ను పకడ్బందీగా అమలు చేయాలి’

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం-2005 పై పీఐఓలకు మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లతో కలసి పాల్గొన్నారు. ఆర్టీఐ దరఖాస్తులను సకాలంలో డిస్పోస్ చేయాలన్నారు.