News May 12, 2024

గైర్హాజరైన సిబ్బందిని సస్పెండ్ చేయాలి: శివశంకర్

image

ఎన్నికల విధులకు ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేయవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి శంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ నెల 14 మధ్యాహ్నం వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ఆయన ఆదేశించారు.

Similar News

News February 13, 2025

ఎమ్మెల్సీ ఓటుకు ఈ ధృవపత్రాలు తప్పనిసరి: కలెక్టర్

image

గుంటూరు-కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి EPIC కార్డ్ లేని పక్షంలో ప్రత్యామ్నాయ ధృవపత్రాలు చూపించవచ్చని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఉద్యోగుల సేవా గుర్తింపు కార్డ్, MP/MLA/MLCలు, విద్యాసంస్థలు జారీచేసిన సేవా గుర్తింపు కార్డులతో పాటూ వర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్స్ చూపాలన్నారు.

News February 12, 2025

కొల్లిపరలో భారీ కొండ చిలువ 

image

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

News February 12, 2025

గుంటూరులో నేటి చికెన్ ధరలు ఇవే!

image

గుంటూరు జిల్లాలో పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే చికెన్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. జిల్లాలో నేడు స్కిన్ లెస్ రూ.246, స్కిన్ రూ.236గా ఉంది. సాధారణ రోజుల్లో గుంటూరుకి ఇతర జిల్లాలకు 5, 10 రూపాయలు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి గుంటూరుకి ఇతర జిల్లాలకు రూ.20 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది.

error: Content is protected !!