News January 28, 2025

గొంగడి త్రిష సెంచరీ.. మంత్రి రాజనర్సింహ అభినందనలు

image

ఉమెన్స్ U-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని, అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించాలని అనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు త్రిష ప్రదర్శన స్పూర్తిగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.

Similar News

News September 16, 2025

ఆంజనేయుడికి తన శక్తుల గురించి ఎందుకు తెలియదు?

image

ఆంజనేయుడు చాలా శక్తిమంతుడు. బాల్యం నుంచి ఆయనకు అనేక శక్తులు ఉన్నాయి. కానీ తన అల్లరి చేష్టల వల్ల రుషులు హనుమంతుడ్ని శపిస్తారు. అందువల్లే ఆయన తన శక్తులను మర్చిపోయాడు. రాముని సేవలో లంకకు వెళ్లాల్సిన సమయంలో జాంబవంతుడు ఈ శాపాన్ని గుర్తుచేశాడు. అప్పుడు మారుతీ తన శక్తులను తిరిగి తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ధర్మ సంస్థాపన కోసం మాత్రమే ఆయన తన శక్తులను ఉపయోగించారని పురాణాలు చెబుతున్నాయి.

News September 16, 2025

నరదిష్టి పోవాలంటే ఇలా చేయండి!

image

ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే నరదిష్టి పోవాలంటే జ్యోతిష నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. ‘సంద్రపు నీటిని ఇంటిపైన, వ్యాపార స్థలంలో చల్లాలి. దొడ్డు ఉప్పును ఎర్రటి వస్త్రంలో కట్టి మంగళవారం ఇంటి ముందు ఉంచాలి. బుధవారం పారే నీటిలో వేయాలి. ఆవు పేడ, పచ్చ కర్పూరం, పసుపు, కస్తూరి కలిపి అక్కడక్కడా చల్లాలి. ఉడికించిన బంగాళదుంపలను గోవుకు తినిపించడం కూడా శుభప్రదం’ అని చెబుతున్నారు.

News September 16, 2025

ఆమె ప్రతీకారమే.. పాండవుల విజయానికి కారణమైంది!

image

అంబ, శాల్వ మహారాజును ప్రేమించి, భీష్ముడి కారణంగా అతడిని కోల్పోయింది. దీనికి ప్రతీకారంగా భీష్ముడి చావుకు కారణమయ్యే వరం కోరి, ఆమె శిఖండిగా మళ్లీ జన్మించింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు శిఖండిని చూసి ఆయుధాలను కింద పెట్టేస్తాడు. అలా శిఖండి తన పగను తీర్చుకుంటుంది. ఆమె వ్యక్తిగత పగతో భీష్ముడి చావుకు కారణమైనా, కౌరవ పక్షాన ఉన్న ధీరుడిని ఓడించడం ద్వారా.. ధర్మం గెలవడానికి ఆమె పరోక్షంగా తోడ్పడింది.