News March 16, 2025
గొల్లపల్లి మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఆదివారం 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాయికల్లో 40.7, మల్లాపూర్లో 40.6, భీమారంలో 40.6, పెగడపల్లి లో, మెట్పల్లిలో 40.4, ధర్మపురిలో 40.4, కోరుట్లలో 40.4, ఇబ్రహీంపట్నంలో 40.3, ఎండపల్లిలో 40.2, వెల్గటూర్లో 40.2, సారంగాపూర్లో 40.2°C నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
వరంగల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి

వరంగల్ జిల్లాలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్ అధికారులను తెలంగాణ గౌడ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్, నేతలు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్గ్రేషియో చెల్లించాలని, తాటి, ఈత చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వాలు వెంటనే జారీ చేయాలని కోరారు.
News November 21, 2025
తంగళ్ళపల్లి: పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్ను సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి ఆయుధాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ రౌడీ షీటర్స్ను తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మొగిలి, ఎస్సై ఉపేంద్ర చారి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.


