News January 26, 2025

గొల్లపల్లి: 150 ఫీట్ల పొడువు గల త్రివర్ణ పతాకంతో ర్యాలీ

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 150 ఫీట్లు పొడువు గల త్రివర్ణ పతాకంతో 76 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ర్యాలీ తీశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీసి వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించామన్నారు.

Similar News

News February 10, 2025

NGKL: త్వరలో సర్పంచ్ ఎన్నికలు.. జిల్లా వివరాలివే..

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు, అన్ని పార్టీల నాయకులు సన్నద్ధం అవుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు, 4 మున్సిపాలిటీ‌లు, 20 మండలాలు ఉన్నాయి. చారకొండ, పదర కొత్త మండలాలు ఏర్పాటుతో ZPTC, MPP పదవులు పెరగనున్నాయి. ప్రస్తుతం జడ్పీటీసీ-20, ఎంపీపీ-20, ఎంపీటీసీ-147, గ్రామ పంచాయతీలు 461 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.

News February 10, 2025

రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ కన్నీళ్లే: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు కన్నీళ్లే మిగిలాయని BRS నేత హరీశ్ రావు అన్నారు. ధర్నా చౌక్ వద్ద RMP, PMPల ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ప్రజలు నమ్మడం లేదని రాహుల్ గాంధీతో బాండ్ పేపర్లు రాయించారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఒక్కటీ అమలు కావడం లేదు. 11 సార్లు ఢిల్లీ వెళ్లినా రేవంత్‌ సాధించిందేమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 10, 2025

కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

image

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.

error: Content is protected !!