News April 21, 2025

గొల్లపూడి పంచాయితీకి అవార్డు

image

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద జాతీయ పంచాయతీ అవార్డు-2025కు గొల్లపూడి పంచాయతీ ఎంపికైందని పంచాయతీరాజ్ శాఖ సంచాలకుడు కృష్ణతేజ సోమవారం తెలిపారు. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో ఈ పంచాయతీ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని ఆయన వెల్లడించారు.

Similar News

News April 22, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ మణుగూరు సీఐ, రిపోర్టర్✓ఉపఎన్నిక వస్తే భద్రాచలంలో గులాబీ జెండా ఎగురుతుంది: ఎమ్మెల్సీ కవిత ✓బూర్గంపాడులో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి ✓మణుగూరులో ఆటో బోల్తా.. స్వల్ప గాయాలు ✓ఆపరేషన్ థియేటర్లో ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే ✓ములకలపల్లిలో ఉపాధి హామీ పనులు పరిశీలించిన డీపీఓ

News April 22, 2025

‘ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్య’

image

ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.

News April 22, 2025

48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

image

TG: రబీ సీజన్‌లో ధాన్యం దిగుబడికి అనుగుణంగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగంపై రూ.81వేల కోట్లు వెచ్చించినా ఏమీ సాధించలేదని దుయ్యబట్టారు.

error: Content is protected !!