News January 26, 2025

గొల్లప్రోలు: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

image

గొల్లప్రోలు పట్టణ పరిధి కొత్తపేటకు చెందిన రాజనాల వెంకన్న మద్యానికి బానిసై కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. అతని భార్య రాజ్యలక్ష్మి పనికి వెళ్లమని వెంకన్నను నిలదీయగా దీంతో మనస్తాపానికి గురైన వెంకన్న ఇంటి వద్ద ఉన్న చెద పురుగులకు కొట్టే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Similar News

News December 3, 2025

రైల్వే ట్రాక్ పై నాటు బాంబు ఘటనపై ఎస్పీ క్లారిటీ

image

కొత్తగూడెం రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలోని నాటు బాంబును కొరికి ఒక కుక్క మృతి చెందినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని చెత్త పడేసే ప్రదేశం నుంచి కుక్క తినే పదార్థం అని భావించి అడవి జంతువులను వేటాడటానికి తయారుచేసిన నాటు బాంబును ట్రాక్ మీదకు తీసుకువచ్చి కొరకడంతో పేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. ఎవరూ కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.

News December 3, 2025

సమ్మిట్‌కు రావాలని కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానం

image

ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025కు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరినట్లు పెద్దపల్లి MP వంశీకృష్ణ తెలిపారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, MPలతో కలిసి ఢిల్లీ వెళ్లిన వంశీకృష్ణ బుధవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి ప్రాధాన్యతపై చర్చించారు.

News December 3, 2025

ఉప్పల్ నుంచి యాదాద్రి.. వేగంగా విస్తరణ

image

ఉప్పల్ నుంచి యాదాద్రి వెళ్లే వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓ వైపు అండర్ ఫ్లో వర్క్, లేన్ల విస్తరణ సైతం కొనసాగుతోంది. ప్రత్యేక ఇంజినీరింగ్ యంత్రాలతో గత నాలుగు రోజులుగా పనుల్లో మరింత వేగం పెంచినట్లుగా AEE సాయికుమార్ తెలిపారు. NHAI అధికారుల బృందం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మెటీరియల్ టెస్టింగ్ నిర్వహిస్తుంది.