News January 26, 2025
గొల్లప్రోలు: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

గొల్లప్రోలు పట్టణ పరిధి కొత్తపేటకు చెందిన రాజనాల వెంకన్న మద్యానికి బానిసై కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. అతని భార్య రాజ్యలక్ష్మి పనికి వెళ్లమని వెంకన్నను నిలదీయగా దీంతో మనస్తాపానికి గురైన వెంకన్న ఇంటి వద్ద ఉన్న చెద పురుగులకు కొట్టే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Similar News
News October 30, 2025
భక్తిని పెంచే సాధనాలు ‘రుద్రాక్ష, విభూతి’

మానవుడు భగవంతునిపై భక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. రుద్రాక్ష ధారణ ద్వారా ఓ వ్యక్తి నాలుగో వంతు భక్తిని పొందుతాడు. విభూతి ధారణ వల్ల సగ భాగం భక్తి లభిస్తుంది. ఇక మంత్ర జపం చేస్తే మూడు వంతుల భక్తిని సాధించవచ్చు. ఈ పనులన్నింటితో పాటు దేవుడిని పూజిస్తే ఆ వ్యక్తి పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి లభించిన తర్వాత, దాని అంతిమ ఫలం జన్మ రాహిత్యమే. అంటే మోక్షం పొందడమే అన్నమాట. <<-se>>#SIVOHAM<<>>
News October 30, 2025
రామగుండం: ‘విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి’

RGM సింగరేణి వైద్య కళాశాలలో గురువారం జరిగిన వైట్ కోట్ సెర్మనీలో పాల్గొన్న పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్యవృత్తిని ఎంచుకున్న విద్యార్థులు ఏ విపత్కర పరిస్థితులలోనైనా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సింగరేణి మెడికల్ కాలేజ్ అత్యుత్తమ వసతులతో ఉన్నదని, ఫ్యాకల్టీ కట్టుబాటుతో పనిచేస్తోందని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. నరేందర్, డా. లావణ్య, డా. ప్రదీప్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
News October 30, 2025
నీలి రంగులోకి మారిపోయిన కుక్కలు.. కారణం అదేనా?

ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ సమీపంలో కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇవి 1986 నాటి అణు ప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన శునకాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్లే ఇలా మారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీని మూలాన్ని గుర్తించడానికి వాటి వెంట్రుకలు, రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు.


