News March 31, 2025
గొల్లప్రోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

గొల్లప్రోలు రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. వీక్లి స్పెషల్ రైలు నుంచి విశాఖ జిల్లా మర్రిపాలెంకి చెందిన అనిల్ కుమార్గా పోలీసులు గుర్తించారు. అతడు రైలులోని వాష్ బేసిన్ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా ట్రైన్ నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. సంఘటన ప్రాంతానికి తుని రైల్వే పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Similar News
News February 26, 2026
PHOTOS: కమనీయం.. లక్ష్మీనారసింహుడి కళ్యాణం

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం నిన్న సింహలగ్నంలో కనులవిందుగా జరిగింది. ఈ ఘట్టాన్ని చూస్తున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. రాష్ట్ర ప్రభుత్వం, TTD, భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు, స్వర్ణగిరి ఆలయం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. విద్యుత్ వెలుగుల మధ్య ఆలయం వెలిగిపోయింది.
News February 26, 2026
నిర్మల్: నూతన అదనపు కలెక్టర్గా వెంకటేశ్వర్లు

నిర్మల్ జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) సేవలు అందిస్తున్న ఆయనను ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేసింది. ఫైజాన్ అహ్మద్ బదిలీతో ఈ నియామకం జరిగింది. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అధికారుల బృందంలో ఆయన చేరనున్నారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News February 26, 2026
కల్వకుర్తి: మార్చి 1న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక

మార్చి 1న కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు. అండర్-14, అండర్-20, క్రీడాకారులకు 100, 200 మీటర్ల పరుగు పందెం క్రీడలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్రీడలలో పాల్గొనే విద్యార్థులు పుట్టిన తేదీ సర్టిఫికెట్లతో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.


