News September 20, 2024

గోకవరం: గంజాయి రవాణా చేస్తున్న బాలికలు అరెస్ట్

image

గోకవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు బాలికలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై విఎన్వీ పవన్ కమార్ తెలిపారు. వారిది ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరిగా గుర్తించి, వారివద్ద నుంచి సుమారు 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న బాలికలను జువనైల్ హోంకు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. స్వాధీన పరుచుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,53,400 ఉంటుందన్నారు.

Similar News

News September 13, 2025

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

image

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

News September 13, 2025

వర్జీనియా పొగాకు ధర అధరహో

image

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్‌ టైమ్‌ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 13, 2025

తూ.గో: నేడు కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టనున్న కీర్తి

image

జిల్లా కలెక్టర్‌గా నియమితులైన చేకూరి కీర్తి నేడు విధుల్లో చేరనున్నారు. ప్రస్తుత కలెక్టర్ ప్రశాంతి ఆమెకు బాధ్యతలు అప్పగించనున్నారు. విశాఖకు చెందిన కీర్తి 2016లో 14వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. తొలుత చిత్తూరు జిల్లా సబ్-కలెక్టర్‌గా, ఉమ్మడి తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ పని చేశారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో జాయింట్ డైరక్టర్‌గా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు ఈమె మూడోవ కలెక్టర్.