News January 21, 2025

గోకవరం: నేరస్థుడికి ఐదేళ్లు జైలు-ఎస్సై

image

గోకవరం గ్రామానికి చెందిన పిల్లి ఆనందబాబుకు ఐదేళ్ల జైలు రూ.22 వేలు జరిమానాను అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి శ్రీ లలిత విధిస్తూ తీర్పునిచ్చారు. 2015 సంవత్సరంలో గోకవరానికి చెందిన స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆనందబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాజమండ్రి కోర్టులో నేరం రుజువు చేయడంతో శిక్ష పడినట్లు గోకవరం ఎస్సై సోమవారం తెలిపారు.

Similar News

News November 29, 2025

రాజమండ్రి: గోదావరి బాలోత్సవానికి సర్వం సిద్ధం

image

రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న గోదావరి బాలోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి, గోదావరి బాలోత్సవం ఛైర్మన్ దుర్గేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, కలెక్టర్ కీర్తి చేకూరి, డీఈఓ కె. వాసుదేవరావు అతిథులుగా పాల్గొంటారు. జిల్లాలోని 145 పాఠశాలల నుంచి 8 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

News November 28, 2025

పీఎంఏవై గ్రామీణ సర్వే పూర్తి: కలెక్టర్ కీర్తి

image

పీఎంఏవై గ్రామీణ 2.0 పథకం కింద ఇళ్లు లేని పేదల గుర్తింపు గడువు నవంబర్ 30 వరకు ఉండటంతో, జిల్లాలో 16,335 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. గృహనిర్మాణ శాఖ సిబ్బంది ద్వారా ‘ఆవాస్ ప్లస్’ యాప్‌లో సర్వే పూర్తి చేసినట్లు ఆమె ప్రకటించారు. అర్హత కలిగి, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News November 28, 2025

రాజానగరం: ధాన్యం కొనుగోళ్లపై జేసీ ఆరా

image

రాజానగరం మండలంలోని జి. ఎర్రంపాలెంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి పండించిన రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ శుక్రవారం స్వయంగా మాట్లాడారు. పంట దిగుబడి వివరాలను తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లకు తోలిన ధాన్యానికి సంబంధించిన నగదు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుందా లేదా అని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.