News December 28, 2024

గోకవరం: 144 సెక్షన్ అమలు.. ఇద్దరు అరెస్ట్ 

image

గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామంలో అలస్కాలో బాధితులు శనివారం తలపెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా సమావేశాన్ని నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ సమస్యలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 26, 2025

సీతానగరం: పేలిన గ్యాస్ సిలిండర్.. అగ్ని ప్రమాదం

image

సీతానగరం మండలం రఘుదేవపురంలో ఆదివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా తునా తునకులు అయింది. కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

News January 26, 2025

రాజమండ్రిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య- ఎస్సై

image

రాజమండ్రి పనసచెట్టు సెంటర్ ప్రాంతానికి చెందిన సాలా బాల పరమేశ్వరి(35) ఆర్థిక ఇబ్బందులతో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. మృతదేహాన్ని త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి డెడ్‌బాడీని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

News January 26, 2025

కడియం: నర్సరీ మొక్కలతో జాతీయ జెండా 

image

76వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపుతూ కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలు కూర్పుతో రిపబ్లిక్ డే సందేశాన్ని శనివారం రైతులు ప్రదర్శించారు. మువ్వన్నెల జెండా, ఎర్రకోట, ఆకృతులతో, రిపబ్లిక్ డే అక్షరమాలికను నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్, వినయ్‌లు సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడుతూ 76 వవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆకృతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.