News March 24, 2024

గోదారి జిల్లాల్లో 10 స్థానాల్లో జనసేన.. FINAL

image

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 21 చోట్ల పోటీ చేయనుండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 అభ్యర్థులను ప్రకటిస్తూ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పి.గన్నవరం టికెట్ మొదట టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ చివరికి ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. పోలవరం సీటు సైతం చివరివరకు సందిగ్ధత ఉండగా..చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు అవకాశం వచ్చింది. మొత్తంగా గోదారి జిల్లాలు జనసేనకు కీలకం కానుండగా ఓటరు ఎటువైపో..?

Similar News

News July 9, 2025

‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

image

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.

News July 9, 2025

ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం: కలెక్టర్ నాగరాణి

image

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్స్ జరగాలని, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.

News July 8, 2025

‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

image

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.