News July 22, 2024

గోదావరిఖనిలో దారుణం.. అన్న చేతిలో తమ్ముడి హతం 

image

గోదావరిఖనిలో దారుణం జరిగింది. పోలీసుల ప్రకారం.. కృష్ణానగర్‌లో ఆత్మకూరి అనిల్ అనే వ్యక్తి అతడి తమ్ముడు సునీల్, తండ్రి ఓదెలతో ఘర్షణకు దిగి వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా.. తండ్రి ఓదెలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా వీరిమధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Similar News

News October 3, 2025

జిల్లా జాగృతి అధ్యక్షుడిగా హరిప్రసాద్

image

కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ నియామకయ్యారు. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. జాగృతి మొదలుపెట్టిన నాటి నుంచి జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసినందుకు గాను జిల్లా జాగృతి అధ్యక్షుడిగా హరిప్రసాద్‌ను కవిత ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతానికి మరింత కృషి చేస్తానని హరిప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News October 2, 2025

KNR: జంబిపూజ రాక్షస సంహారానికి పదేళ్లు..!

image

KNR పట్టణంలోని కిసాన్ నగర్‌లో 2015లో ప్రారంభమైన జంబిపూజ రాక్షస సంహారం కార్యక్రమం ఈ సంవత్సరంతో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక నేటి దసరా సంబరాలకు కిసాన్ నగర్ జంబిగద్దె వేదిక సిద్ధమైంది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం స్థానికులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా జరుపుకోనున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు.

News October 1, 2025

KNR: ‘నర్సరీలోని మొక్కలను సంరక్షించాలి’

image

నగరపాలిక ఆధ్వర్యంలో ఎల్ఎండీ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. మొక్కలు ఎండిపోకుండా నీటిని అందిస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నర్సరీలో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి శుభ్రం చేయాలన్నారు. రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటించాలని సూచించారు.