News February 22, 2025
గోదావరిఖనిలో యువకుడిపై హత్యాయత్నం

గోదావరిఖని హనుమాన్నగర్కు చెందిన ఖలీల్ అనే యువకుడిపై తిలక్నగర్లో ఈరోజు సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ సంఘటనలో ఖలీల్ మెడపై తీవ్ర గాయం కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 15, 2025
ములుగు: ప్రశ్నార్థకంగా మావోయిస్టుల గమ్యం!

మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. అగ్రనేతలతో పాటు, రాష్ట్ర కమిటీ, డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ నాయకులు లొంగిపోతుండడం ప్రశ్నార్థకంగా మారింది. 2025 లెక్కల ప్రకారం ఇప్పటివరకు 144 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందగా, 499 మంది అరెస్టయ్యారు. ఇందులో 560 మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో సీసీ కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో మృతి చెందగా, మరి కొంత మంది సరెండర్ బాట పట్టారు.
News November 15, 2025
NZB: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి వద్ద శనివారం NZB-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
News November 15, 2025
మల్టీప్లెక్స్ థియేటర్లలో ఇదేం దోపిడీ!

ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకు వచ్చే ప్రేక్షకులను మల్టీప్లెక్స్ థియేటర్లు దోచుకుంటున్నాయి. ఇంటర్వెల్లో ఇష్టం వచ్చిన రేట్లతో స్నాక్స్, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. మల్టీప్లెక్స్లలో రూ.20ల ఎగ్ పఫ్, కూల్ డ్రింక్ రూ.80, రూ.5 సమోసా రూ.20, పాప్ కార్న్ రూ.100 వరకు అమ్ముతూ ప్రేక్షకులను ముంచుతున్నారు. ఈ అధిక ధరలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్లోని 4 మల్టీప్లెక్స్లలో ఈ పరిస్థితి ఉంది.


