News February 17, 2025
గోదావరిఖనిలో రక్తదాన శిబిరం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖని మెడికల్ కళాశాలలో సోమవారం ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని కోరుకంటి చందర్ కోరారు.
Similar News
News October 31, 2025
గణపవరం తిరిగి ఏలూరు జిల్లాలోకి?

ఒక నియోజకవర్గం ఒకే డివిజన్లో ఉంచాలన్న ప్రభుత్వం నిర్ణయం ఇప్పడు గణపవరం మండల ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ఆ మండలం ఏలూరు జిల్లాలో కలిసే అవకాశముంది. గత ప్రభుత్వంలో తమకు భీమవరం దగ్గరని.. ఏలూరులో కలపొద్దని అక్కడి ప్రజలు కోరారు. దీంతో ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరులో కలిసినా గణపవరంను భీమవరం రెవెన్యూ డివిజన్లో ఉంచేశారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు మళ్లీ ఆందోళనలు చేపడుతున్నారు.
News October 31, 2025
కేయూ డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ వొకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం & సిటీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువును రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 3 వరకు పొడిగించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు నియంత్రణాధికారి వెంకటయ్య తెలిపారు.
News October 31, 2025
ADB: బల్ల కింద మాకిస్తేనే.. మీ పని చేస్తాం

ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో మునిగి అవినీతికి పాల్పడుతున్నారు. సంక్షేమ పథకాల బిల్లులను మంజూరు చేయడానికి సామాన్యులను పీడిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో రెండు శాఖల అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పశువుల షెడ్డుకు రూ.10వేలు, సస్పెన్షన్ ఎత్తివేతకు రూ.2 లక్షలు లంచం అడగడం అధికారుల దురాశకు నిదర్శనం. లంచం అడిగితే 1064, 9440446106 నంబర్లకు కాల్ చేయండి.


