News February 17, 2025
గోదావరిఖనిలో రక్తదాన శిబిరం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరిఖని మెడికల్ కళాశాలలో సోమవారం ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని కోరుకంటి చందర్ కోరారు.
Similar News
News April 17, 2026
ఏలూరు: తండ్రి మరణాన్ని తట్టుకోలేక యువతి సూసైడ్

తండ్రి మరణాన్ని తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో జరిగింది. ఏలూరు(D) చాట్రాయికి చెందిన కేశవరెడ్డి మార్చి 31న అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో HYDలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న కేశవరెడ్డి కూతురు జ్ఞాన శ్రీ మనోవేదనకు గురై నిన్న హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రూంలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 17, 2026
వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్పై కేసు

ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్ బాయిలర్ పేలుడు <<19650757>>ఘటన<<>>లో మృతుల సంఖ్య 20కి చేరింది. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్తో పాటు ప్లాంట్ మేనేజర్పై FIR నమోదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపాల వల్లే ఇంతమంది ప్రాణాలు పోయాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
News April 17, 2026
తిరుమలలో సహస్ర నామార్చన ఆంతర్యం

తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాలసేవ తర్వాత జరిగే ముఖ్య కైంకర్యం సహస్ర నామార్చన. ఇందులో స్వామివారిని 1008 నామాలతో పూజిస్తారు. ఈ నామాల ద్వారా శ్రీమహావిష్ణువు సకల వైభవాలను కీర్తిస్తారు. సకల దుఃఖాలను తొలగించేది, శుభాలను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే అనే భావనతో ఈ అర్చన జరుగుతుంది. భక్తులు ఆర్జితసేవ టికెట్ల ద్వారా ఈ పవిత్రమైన అర్చనలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.


