News January 27, 2025
గోదావరిఖని: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

గోదావరిఖనిలో మేదర బస్తీకి చెందిన నందీశ్వర్ అనే ఇంటర్ విద్యార్థి రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందీశ్వర్ ఎన్టీపీసీలోని ప్రైవేటు కళాశాలలలో ఇంటర్ చదువుతున్నాడు. ఘటనా స్థలానికి గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 17, 2025
BREAKING: ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో హాష్ ఆయిల్తో పట్టుబడ్డ బాలుడు

ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో హాష్ ఆయిల్ తీసుకెళుతున్న బాలుడిని మల్కాజిగిరి SOT, ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా ఈరోజు పట్టుకున్నారు. దేబేంద్ర జోడియా శ్రీను అనే వ్యక్తి ఒడిశా నుంచి HYDకు రూ.1.15 కోట్ల విలువైన 5.1 కిలోల హాష్ ఆయిల్ను బాలుడితో పంపిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలుడిని జువైనల్ హోమ్కు తరలించామని, పరారీలో ఉన్న దేబేంద్ర కోసం గాలిస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు.
News October 17, 2025
అనకాపల్లి: ఉద్యోగుల సమస్యపై 11 వినతులు

ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ నిర్వహించారు. 11 మంది ఉద్యోగులు సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలపై నెలలో మూడవ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఆర్ఓ సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
News October 17, 2025
జగన్పై దుమ్మెత్తడానికి మాత్రం పవన్ ఊపుకుంటూ వస్తాడు: పేర్ని నాని

కల్తీ మద్యంతో అడ్డగోలు దోపిడీ జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా నిద్రపోతున్నారా? గతంలో జగన్ మద్యపాన ప్రియుల కడుపు కొట్టాడని ఊగిపోయిన పవన్ ఇపుడు నోరెత్తే ధైర్యం చేయడం లేదు. అబద్ధాలను జగన్కు అంటించడానికి మాత్రం ఊపుకుంటూ వస్తాడు’ అని ఎద్దేవా చేశారు. కల్తీ పాపాన్ని YCPకి అంటించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.