News March 21, 2025
గోదావరిఖని: ప్రాణం తీసిన బెట్టింగ్..

బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న కొరవీణ సాయితేజ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది రెండురోజుల క్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.
Similar News
News October 17, 2025
నారదుడు సినిమాల్లో చూపించినట్లే ఉంటాడా?

నారద మహర్షిని సినిమాల్లో అనవసర తగువులు పెట్టే పాత్రగా చూపిస్తారు. కానీ నారదుడు నారాయణుడికి పరమ భక్తుడు. నిస్వార్థపరుడు. అపర బుద్ధిమంతుడు. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు రచించిన వేదవ్యాసుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, వాల్మీకి వంటి గొప్ప వారికి గురువు ఆయన. నారద మహర్షి లోక కళ్యాణం, దైవ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం ముల్లోకాలు సంచరించేవారు. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ.
News October 17, 2025
బాపట్ల: జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించాలి

జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ డా.వి.వినోద్కుమార్. బాపట్లలో జరిగిన గ్రామీణ నీటి సరఫరా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 1.48 లక్షల గృహాలకు మాత్రమే కొళాయి కనెక్షన్లు ఉన్నాయని, మిగిలిన 2.15 లక్షల గృహాలకు డిసెంబర్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.167.48 కోట్లతో 403 పనులు జరుగుతుండగా, ఆలస్యం చేసిన ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలని హెచ్చరించారు.
News October 17, 2025
HYD: రేపు బంద్.. మరి వైన్స్ టెండర్లు..?

రేపు బీసీ సంఘాలు తెలంగాణ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైన్స్ టెండర్లకు ఎటువంటి అడ్డంకి ఉండదని, సెంటర్లు యథావిధిగా కొనసాగుతాయని DPEO ఉజ్వల రెడ్డి ఈరోజు HYDలో తెలిపారు. రేపటితో వైన్స్ టెండర్ల ప్రక్రియ ముగియనున్నట్లు చెప్పారు. రేపు సా.5 గంటల్లోపు సెంటర్లో ఉన్న వారి అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు. రేపు చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.