News October 17, 2024

గోదావరిఖని: రహదారిపై యువకుడి మృతి 

image

గోదావరిఖని పరశురాం నగర్‌కు చెందిన సంతోశ్ పట్టణంలోని కళ్యాణ్ నగర్ మటన్ షాపుల రహదారిపై మృతి చెందాడు. ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే అతిగా మద్యం తాగి మరణించి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News July 11, 2025

కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

image

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.

News July 11, 2025

కరీంనగర్: PET పోస్టుకు దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

image

కరీంనగర్ జిల్లా KGBVలోని ఖాళీ పీఈటీ పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య గురువారం తెలిపారు. 2023లో అర్హత పొందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. వారిని ఫోన్ లేదా మెసేజ్ ద్వారా పిలుస్తామని, వివరాలను www.karimnagardeo.com వెబ్‌సైట్‌లో పెడతామని, సంబంధిత అభ్యర్థులు తగు సర్టిఫికేట్లు, 3 ఫొటోలతో ఈనెల 11న జిల్లా విద్యా శాఖ ఆఫీస్‌లో హజరుకావాలన్నారు.

News July 10, 2025

జమ్మికుంట: గంజాయి విక్రయం.. నలుగురి అరెస్టు

image

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎఫ్‌సీఐ సమీపంలో నిషేధిత గంజాయి అమ్మేందుకు వచ్చిన నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు యువకులను పట్టుకుని విచారించి వివరాలు సేకరించినట్లు చెప్పారు.