News March 4, 2025
గోదావరి గడ్డపై తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News October 25, 2025
దాని బదులు చావును ఎంచుకుంటా: లాలూ కుమారుడు

RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి తండ్రి పార్టీలో చేరే బదులు చావును ఎంచుకుంటానని చెప్పారు. తనకు నైతిక విలువలు, ఆత్మగౌరవమే ముఖ్యమని తెలిపారు. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో కొన్ని నెలల క్రితం ఆయనను ఆర్జేడీ బహిష్కరించింది. ఈ క్రమంలో జనశక్తి జనతాదళ్ పార్టీ స్థాపించిన ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మహువా అసెంబ్లీ స్థానం నుంచే బరిలోకి దిగుతున్నారు.
News October 25, 2025
JMKT: మార్కెట్కు రెండు రోజులు సెలవు

JMKT మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 1,200 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,100 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది. CCI ద్వారా అమ్మిన 26.40 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.7866.70, కనిష్ఠంగా రూ.7785.60 ధర లభించింది.
News October 25, 2025
పెద్దపల్లి జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కోదాటి శ్రీనివాసరావు

తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా కోదాటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నియామకాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలను బలోపేతం చేయాలని శ్రీనివాసరావు కృషి చేస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. నియామకంపై అభిమానులు, ప్రజలు, జాగృతి కార్యకర్తలు శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు.


